కరోనా పరిస్థితుల్లో అసాధ్యమనుకున్న ఐపీఎల్ విజయవంతంగా ముగిసింది. దీంతో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్మీడియా ద్వారా లీగ్ నిర్వాహకులను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ క్రమంలోనే వారికి అభినందనలు తెలుపుతూ టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి పెట్టిన ట్వీట్ వైరల్గా మారింది. నెటిజన్లు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
గంగూలీని మర్చిపోయావా?
ఐపీఎల్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా లీగ్ ఆర్గనైజర్లు, మెడికల్ బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ను చక్కగా నిర్వహించారని కొనియాడాడు. దీన్ని డ్రీమ్ ఐపీఎల్గా మార్చారంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా, బ్రిజేష్ పటేల్ పేర్లను ప్రస్తావించాడు. కానీ తన ట్వీట్లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేరును మాత్రం ట్యాగ్ చేయలేదు. దీంతో నెటిజన్లు టీమ్ఇండియా కోచ్పై మండిపడుతున్నారు. 'కరోనా వేళలో.. అసాధ్యమనుకున్న ఐపీఎల్ను దాదా సుసాధ్యం చేశాడు. కానీ మీరు ఆయన పేరును ట్యాగ్ చేయడం మర్చిపోయారంటూ' రవిశాస్త్రికి చురకలు అంటిస్తున్నారు.
గతంలో రవిశాస్త్రిని కాదని అనిల్ కుంబ్లేను టీమ్ఇండియా సారథి కావడానికి గంగూలీ సాయపడ్డాడని.. అందుకే శాస్త్రి.. దాదా పేరును ట్యాగ్ చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ముంబయి గెలుపు ఎప్పటికీ మారదు'