రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ, అలాంటి బ్యాట్స్మన్ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు ఎందుకు పంపలేదనే దానిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇషాన్ కిషన్ అప్పటికే అలసిపోయి ఉన్నాడని.. అందుకే అతడిని సూపర్ఓవర్కు పంపలేదని స్పష్టం చేశాడు.
"ఆట చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఛేదనలో మేము చాలా వెనుకపడి ఉన్నాం. ఇషాన్ కిషన్ తన గొప్ప ఇన్నింగ్స్తో మరింత ఆసక్తి పెంచాడు. ఎప్పటిలాగే పొలార్డ్ అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో జట్టుకు సరైన ప్రారంభాన్ని ఇవ్వలేకపోయాం. కానీ, బలమైన బ్యాటింగ్ లైనప్తో లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. బరిలో పొలార్డ్ ఉంటే ఏదైనా సాధ్యమే.. ఇషాన్ కిషన్ కూడా కొట్టగలడు. గెలుస్తామనే నమ్మకం మాకు కలిగింది. ఇషాన్ కిషన్ అప్పటికే అలసిపోవడం వల్ల సూపర్ఓవర్ ఆడలేకపోయాడు. అందుకే హార్దిక్ పాండ్యాను బరిలో దించాం. హార్దిక్ అయితే హిట్టింగ్ చేయగలడని అనుకున్నాం."
- రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్
సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దిగిన రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ మాత్రమే చేయడం వల్ల మ్యాచ్ టైగా నిలిచి సూపర్ఓవర్కు దారితీసింది. అందులో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా తర్వాత బెంగళూరు ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం వల్ల టోర్నీలో రెండో గెలుపును రుచిచూసింది కోహ్లీసేన.
కిరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ఛేదనలో ముంబయి బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్(99; 58 బంతుల్లో, 2x4, 9x6), కీరన్ పొలార్డ్ (56; 23 బంతుల్లో 2x4, 5x6) రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 30 బంతుల్లో 89 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ టైగా మారింది. కానీ, సూపర్ఓవర్లో ముంబయి ఓడిపోవడం వల్ల వీరిద్దరి పోరాటం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. బెంగళూరు బ్యాట్స్మెన్ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, దేవ్దత్ పడిక్కల్ అర్థశతకాలతో పాటు శివమ్ దూబె మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీకి కలిసొచ్చాయి.