సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ముంబయి. వాంఖడే వేదికగా జరుతున్న ఈ మ్యాచ్లో నెగ్గి ప్లే ఆఫ్కు వెళ్లాలని చూస్తున్నాయి ఇరు జట్లు. హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చేయగా... ముంబయి జట్టును మార్చలేదు.
వాంఖడే పిచ్పై మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్లు సగటున 187 పరుగులు చేస్తున్నాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముంది. సన్రైజర్స్ జట్టులో వార్నర్ స్వదేశానికి వెళ్లగా... అతడి స్థానంలో మార్టిన్ గప్తిల్ ఆడనున్నాడు. సందీప్ శర్మ స్థానంలో బసిల్ థంపికి అవకాశమిచ్చింది.
వార్నర్, బెయిర్స్టోను మ్యాచ్కు దూరం కావడం హైదరాబాద్కు ప్రతికూలంగా మారింది. మనీశ్ పాండే ఫామ్లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఏడు మ్యాచుల్లో నెగ్గిన ముంబయి ఈ మ్యాచ్లో గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్ చేరాలనుకుంటోంది.
జట్లు..