Indian Cricketers Who Did not Get Farewell : ఇండియాలో క్రికెట్కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇందులోని ప్లేయర్లును తమ అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తుంటారు. ఆ క్రీడాకారుల ఆట తీరును చూసి మురిసిపోతుంటారు. అయితే ఏ ఫీల్డ్కైనా రిటైర్మెంట్ అనేది ఓ కీలక సందర్భం. ఎంతటి ప్లేయరైన సరే తమ ఆటకు ఇంక వీడ్కోలు పలకాల్సిందే. అయితే క్రికెట్లో మాత్రం ఇది ఎంతో బాధాకరమైన విషయం. తమ అభిమాన ప్లేయర్లు ఇకపై బ్యాట్ పట్టరు అని తెలుసుకున్న ఫ్యాన్స్ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయినప్పటికీ తమ స్టార్స్ సెకెండ్ ఇన్నింగ్స్కు శుభాకాంక్షలు తెలుపుతుంటారు.
ఇక క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో తమ అభిమానులు భావోద్వేగానికి లోనవుతూ తమ ప్లేయర్లకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంటారు. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కూడా ఆయనకు గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ ప్లేయర్లు తమ గేమ్కు గ్రాండ్గా వీడ్కోలు పలికారు. అయితే టీమ్ఇండియాకు చెందిన ఓ ఐదుగురు గొప్ప క్రికెటర్లు మాత్రం ఏటువంటి వీడ్కోలు లేకుండానే సింపుల్గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకీ వారెవరంటే ?
గౌతమ్ గంభీర్ : 2007, 2011 ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బ్యాటర్ సరైన వీడ్కోలు లేకుండానే తన కెరీర్ను ముగించాడు. 2016లో ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన గంభీర్, సరిగ్గా రెండేళ్ల తర్వాత దిల్లీ రంజీ టీమ్ తరపున మ్యాచ్ ఆడి తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.