దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ బౌలర్ల.. ధాటికి సఫారీ బ్యాటర్లు చతికిల పడ్డారు. 27.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ మెరుపు ప్రదర్శన చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షహబాజ్ అహ్మద్ రెండు చొప్పున వికెట్లు తీశారు. సఫారీ జట్టులో క్లాసెన్, మలాన్, యాన్సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
16:20 October 11
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికా విలవిల.. 99కే ఆలౌట్
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. ఆది నుంచే విజృంభించింది. మూడో ఓవర్లోనే మొదటి వికెట్ను పడగొట్టింది. ఓపెనర్గా వచ్చిన డికాక్ ఆరు పరుగులకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ మలన్ 27 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం వచ్చిన హెండ్రిక్స్(3), మాక్రమ్(9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ మంచి ప్రదర్శనతో జట్టును గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. చూడముచ్చటైన షాట్లతో 42 బంతుల్లో 34 నాలుగు పరుగులు చేశాడు. అనంతరం షహబాజ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాటర్లంతా వచ్చినంతసేపు కూడా క్రీజులో ఉండలేదు. డేవిడ్ మిల్లర్(7), పెహ్లుక్వాయో(5), పోర్టిన్(1), నోకియా(0), ఎంగిడి(0) పేలవ ప్రదర్శన చేశాడు. యాన్సెన్(14) ఫర్వాలేదనిపించాడు.
ఇవీ చదవండి:బాలీవుడ్లోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. ఆ సినిమాతోనే
TAGGED:
INDIA VS SA FIRST INNINGS