కేరళ యువ క్రికెటర్ సంజు శాంసన్... ఎన్నో సిరీస్ల్లో ఎంపికైనా, పుణె వేదికగా లంకతో జరిగిన మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశమొచ్చింది. 73 మ్యాచ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఈ బ్యాట్స్మన్.. కోహ్లీ ఎప్పుడూ వచ్చే మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచినా.. అనూహ్యంగా రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వచ్చిన అవకాశం ఊహించని విధంగా ఇలా నీరుగారిపోవడం వల్ల కాస్త భావోద్వేగంతోనే మైదానాన్ని వీడాడు.
ట్రోఫీ బహుకరణ సమయంలో
ఈ మ్యాచ్లో ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలకు తోడు కోహ్లీ, మనీశ్ పాండే, శార్దూల్ ఠాకూర్ ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది భారత్. లక్ష్య ఛేదనలో 123 పరుగులకే కుప్పకూలింది లంక. ఫలితంగా 78 పరుగులతో విజయం సాధించింది కోహ్లీసేన. మూడు టీ20 సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి లంకతో 19 సిరీస్లు ఆడిన టీమిండియా.. 17 విజయాలు, 2 డ్రా నమోదు చేసింది.