తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా గ్రూప్​ ఫొటోలో సంజూ మిస్సింగ్.. కారణమిదే!

శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్​ను 2-0 తేడాతో గెల్చుకుంది టీమిండియా. ట్రోఫీ బహుకరణ సమయంలో యువ క్రికెటర్​ సంజు శాంసన్​ కనిపించకపోవడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. రెండో బంతికే ఔటైన సంజూ.. కాస్త భావోద్వేగంతో కనిపించాడు. ఫలితంగా ఏమైందనే విషయంపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. తాజాగా దానికి ఓ ట్వీట్​ సమాధానమిచ్చింది.

By

Published : Jan 11, 2020, 7:53 PM IST

why Sanju Samson was missing from the team picture at trophy celebrations..?
టీమిండియా గ్రూప్​ ఫొటోలో సంజు శాంసన్​ మిస్సింగ్​కు కారణమిదే..!

కేరళ యువ క్రికెటర్​ సంజు శాంసన్​... ఎన్నో సిరీస్​ల్లో ఎంపికైనా, పుణె వేదికగా లంకతో జరిగిన మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశమొచ్చింది. 73 మ్యాచ్​ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఈ బ్యాట్స్​మన్​.. కోహ్లీ ఎప్పుడూ వచ్చే మూడో స్థానం​లో బ్యాటింగ్​కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్​గా మలిచినా​.. అనూహ్యంగా రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వచ్చిన అవకాశం ఊహించని విధంగా ఇలా నీరుగారిపోవడం వల్ల కాస్త భావోద్వేగంతోనే మైదానాన్ని వీడాడు.

ట్రోఫీ బహుకరణ సమయంలో

ఈ మ్యాచ్​లో ఓపెనర్లు ధావన్​, కేఎల్​ రాహుల్​ అర్ధశతకాలకు తోడు కోహ్లీ, మనీశ్​ పాండే, శార్దూల్​ ఠాకూర్​ ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు​ చేసింది భారత్. లక్ష్య ఛేదనలో 123 పరుగులకే కుప్పకూలింది లంక. ఫలితంగా 78 పరుగులతో విజయం సాధించింది కోహ్లీసేన. మూడు టీ20 సిరీస్​ను 2-0 తేడాతో గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి లంకతో 19 సిరీస్​లు ఆడిన టీమిండియా.. 17 విజయాలు, 2 డ్రా నమోదు చేసింది.

ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​, బౌలింగ్​తో రాణించిన శార్దుల్​.. మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు. సిరీస్​లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న సైనీ... మ్యాన్​ ఆఫ్​ ద సిరీస్​గా నిలిచాడు. ట్రోఫీ బహుకరణ సమయంలో సంజూ మైదానంలో కనిపించలేదు. గ్రూప్​ ఫొటోలోనూ అతడు మిస్సయ్యాడు. నెటిజన్లకు ఇది ఎన్నో సందేహాలు రేకెత్తించింది.

సంజు శాంసన్​

ఇదీ జరిగింది?

న్యూజిలాండ్​ లో ప్రాక్టీస్​ మ్యాచ్​లకు ఇండియా-ఏ జట్టు శుక్రవారమే పయనమైంది. అయితే ఇందులో చోటు దక్కించుకున్న సంజూ... ఈ మ్యాచ్​ ముగిసిన వెంటనే వారిని కలిసేందుకు హోటల్​కు వెళ్లిపోయాడు. మయాంక్​ అగర్వాల్.. ఈరోజు​ షేర్​ చేసిన ఓ ఫొటో ద్వారా ఈ విషయం తెలిసింది.

ఇండియా-ఏ.. కివీస్​తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈనెల 17 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details