తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమితాబ్ బచ్చన్​ గాత్రం​తో క్రికెట్ కామెంటరీ

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గాత్రాన్ని అనుకరించి కామెంటరీ చేశారు క్రికెట్ వ్యాఖ్యాతలు గావస్కర్, హర్షా భోగ్లే. భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో జరిగిన ఆ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది బీసీసీఐ.

By

Published : Sep 23, 2019, 10:44 AM IST

Updated : Oct 1, 2019, 4:19 PM IST

అమితాబ్ బచ్చన్​ గాత్రం​తో క్రికెట్ కామెంటరీ

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో​ ఓడిపోయింది. సిరీస్​ను 1-1 తో డ్రా చేసుకుంది. అయితే చివరి మ్యాచ్​లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. పంత్​ బ్యాటింగ్​ ఆడుతుండగా 'కౌన్​ బనేగా కరోడ్​పతి'లోని అమితాబ్​ బచ్చన్​ గాత్రాన్ని అనుకరించి మాట్లాడారు వ్యాఖ్యాతలు గావస్కర్, హర్షా భోగ్లే. టీ20ల్లో నాలుగో స్థానానికి సరైన బ్యాట్స్​మెన్​ ఎవరంటూ నెటిజన్లను ప్రశ్నించారు. శ్రేయర్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్​లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోమని సూచించారు.

ఈ మ్యాచ్​లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన పంత్.. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్​ ధావన్(36) మినహా అందరూ విఫలమయ్యారు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది కోహ్లీసేన. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీలు.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్ డికాక్ 79 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్​ వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ విశాఖపట్నం​ వేదికగా జరగనుంది.

ఇది చదవండి:

Last Updated : Oct 1, 2019, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details