తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రధాని మోదీకి మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కృతజ్ఞతలు - ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్

ఇటీవల జరిగిన 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్ టెస్టులో లక్ష్మణ్, ద్రవిడ్ ఇన్నింగ్స్​ గురించి వివరించారు. తాజాగా ఈ విషయంపై ట్వీట్ చేసిన లక్ష్మణ్.. మోదీకి ధన్యవాదాలు చెప్పాడు.

VVS Laxman
VVS Laxman

By

Published : Jan 25, 2020, 3:18 PM IST

Updated : Feb 18, 2020, 9:05 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ ధన్యవాదాలు చెప్పాడు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో తాత్కాలిక అడ్డంకుల గురించి ఆలోచించొద్దని విద్యార్థులకుమోదీ సూచించారు. ఈ సందర్భంగా ఈడెన్‌ గార్డెన్‌లో 2001లో ఆస్ట్రేలియాపై గంగూలీ సేన విజయం సాధించడంలో లక్ష్మణ్‌, ద్రవిడ్‌ భాగస్వామ్యం గురించి ఆయన వివరించారు. కష్టాలు తాత్కాలికంగానే ఉంటాయని వారిలో స్ఫూర్తి నింపారు.

"చారిత్రక కోల్‌కతా టెస్టు గురించి విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపినందుకు నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నా సలహా ఇదే. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. వాటిని నిజం చేసుకునేందుకు అంకితభావంతో పనిచేయాలి. మరొకరితో పోల్చుకోవద్దు" -వీవీఎస్‌ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్

"2001లో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడ్డప్పుడు మన జట్టు కష్టాలను ఎదుర్కొంది. అభిమానులు నీరుగారిపోయారు. కానీ, ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ నెలకొల్పిన భాగస్వామ్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఫాలో ఆన్‌ ఆడి మరీ మనం మ్యాచ్‌ గెలిచాం" అని మోదీ అన్నారు. 2002లో వెస్టిండీస్‌తో టెస్టు​లో దవడ పగిలినా, మ్యాచ్‌ ఆడిన అనిల్‌కుంబ్లే.. అందరికీ ఆదర్శంగా నిలిచాడని పరీక్షా పే చర్చలో కొనియాడారు. ఈ విషయంపై కుంబ్లే కూడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు.

ఇవీ చూడండి.. ఫించ్ సెంచరీ వృథా.. సిక్సర్స్​దే గెలుపు

Last Updated : Feb 18, 2020, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details