2018లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్మిత్.. అందుకు తగిన మూల్యాన్ని చెల్లించేసుకున్నాడని తెలిపాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మార్క్ వా. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడని చెప్పాడు. కాబట్టి అతడికి కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అప్పజెప్పాల్సిన అవసరముందన్నాడు. డిసెంబరు 17నుంచి భారత్తో జరగబోయే టెస్టు సిరీస్లో పగ్గాలను ఎవరికి అప్పజెప్పాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్ కూడా స్మిత్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని మద్దతు పలికాడు.
"సారథిని ఎన్నుకునే విషయమై స్మిత్కే నా మద్దతు. జట్టులోని ఉత్తమమైన ఆటగాళ్లలో అతడు ఒకడు. 34 టెస్టులు, 51 వన్డేలు, ఎనిమిది టీ20లకు సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. అతడు తాను చేసిన తప్పుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అందుకే చాలా మంది స్మిత్కే మళ్లీ పగ్గాలు అప్పజెప్పాలని అంటున్నారు. కాబట్టి అతడు తన బాధ్యతను (కెప్టెన్) మళ్లీ స్వీకరించే అర్హతను సాధించాడు. అతను ఎంతో ప్రతిభావంతమైన సారథి అని నా అభిప్రాయం."