తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2019, 6:46 PM IST

ETV Bharat / sports

క్రికెటర్లకు వాటర్​ బాటిళ్లు తీసుకెళ్లిన ప్రధాని

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ ఒక్కసారిగా వాటర్​ బాటిళ్లు అందించే బాయ్​గా మారిపోయారు. కానెబెర్రా వేదికగా మనుకా ఓవల్​లో శ్రీలంక- ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రాక్టీస్ మ్యాచ్​లో ఈ దృశ్యం కనిపించింది.

క్రికెటర్లకు వాటర్​ బాటిళ్లు మోసుకెళ్లిన ప్రధాని

మైదానంలో బ్యాట్​, బంతితోనే కాకుండా విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకెళ్లడం, ఆటగాళ్లతో సెల్ఫీలు,ఆటోగ్రాఫ్​ల కోసం ఎగబడుతూ విచిత్రమైన పనులు చేస్తుంటారు. తాజాగా ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది.

కానెబెర్రా వేదికగా మనుకా ఓవల్​లో మ్యాచ్​ జరుగుతుండగా.. విరామ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లకు వాటర్​ బాటిళ్లు అందించారు. శ్రీలంక 16వ ఓవర్​ ఆడుతోంది. అప్పటికే 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆ సమయంలో​ పసుపు రంగు టోపీ, ఫార్మల్​ దుస్తుల్లో వెళ్లిన మారిసన్.. క్రిస్​ లిన్​, జాసన్​ సంగాలకు వాటర్​ బాటిళ్లు, డ్రింక్​లు అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

స్కాట్ మారిసన్

ఈ మ్యాచ్​లో 20 ఓవర్లకు 131 పరుగులకే పరిమితమయ్యారు లంకేయులు. ఫెర్నాండో 38 రన్స్​తో టాప్​స్కోరర్​గా నిలిచాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టు 19.5 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఒక్క వికెట్​ తేడాతో గెలుపొందింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details