భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా.. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో చివరి టెస్టు ఆడిన ఇతడు.. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లోనూ పాల్గొనలేదు. అయితే ఆ టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది.
ఈ మ్యాచ్ దిగ్గజ సచిన్ తెందుల్కర్కు 200వ టెస్టు. అతడికిదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇందులోనే ఓజా.. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి పది వికెట్లతో సత్తా చాటాడు. భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ కెరీర్ కొనసాగించలేకపోయాడు. చివరి మ్యాచ్లో పది వికెట్లు తీసి, కెరీర్కు ముగింపు పలికిన టీమిండియా ఏకైక బౌలర్ ఇతడే కావడం విశేషం.