సొంతగడ్డపై క్రికెట్ ఆడేందుకు అన్ని దేశాలను ఆహ్వానిస్తోంది పాకిస్థాన్ క్రిెకెట్ బోర్డు (పీసీబీ). ఇప్పటికే పలు దేశాలను బతిమిలాడుకోగా... ఇటీవల శ్రీలంక దాయాది దేశంలో అడుగుపెట్టింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా అంగీకారం తెలిపినట్లు పీసీబీ సీఈవో వసీం ఖాన్ తెలిపాడు. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను పాక్లో ఆడేందుకు ఒప్పుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. ఈ ఒప్పందం ప్రకారం 2022లో పాక్లో టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది ఆసీస్ జట్టు.
" ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పాకిస్థాన్లో మూడు టెస్టులు ఆడేందుకు ఒప్పుకొంది. 2022లో మా గడ్డపై ఆసీస్.. మ్యాచ్లు ఆడేందుకు మేము ఎంతో శ్రమించాం."
-- వసీం ఖాన్, పీసీబీ సీఈవో
టెస్టు హోదా ఉన్న దేశాల్లో అందరూ ఏడాదికి 14 మ్యాచ్లు ఆడుతుంటే.. పాక్ మాత్రం ఆరు నుంచి ఏడు మాత్రమే ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు వసీం. దీనికి ప్రధాన కారణం తటస్థ వేదికలపై మ్యాచ్లు నిర్వహించడమేనని అభిప్రాయపడ్డాడు.1998 తర్వాత నుంచి ఇప్పటివరకు పాక్ గడ్డపై టెస్టులు ఆడలేదు కంగారూ జట్టు. ప్రస్తుతం శ్రీలంక, ఇంగ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోనే పాక్ తన మ్యాచ్లను నిర్వహించుకుంటోంది.