తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 1:48 PM IST

ETV Bharat / sports

'కమిన్స్​ను దేశానికి ప్రధాని చేయండి'

న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లతో చెలరేగాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ అతడిని దేశానికి ప్రధాని చేయాలని ట్వీట్లు చేస్తున్నారు.

at Cummins
కమిన్స్

ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్​కు కెరీర్​లో ఉన్నత దశ నడుస్తోంది. ఇటీవల ఐపీఎల్​ వేలంలో కోల్​కతా నైట్​రైడర్స్ ఇతడిని రూ15.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్​ వన్​ బౌలర్​గా ఉన్న ఈ ఆటగాడు న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో విజృంభిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 28 పరుగులిచ్చి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా కివీస్ జట్టు 148 పరుగులకే ఆలౌటైంది. ఈ విషయంపై ఆసీస్ అభిమానులు స్పందిస్తూ కమిన్స్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడిని దేశానికి ప్రధానమంత్రి చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కివీస్​పై ప్రస్తుతానికి 456 పరుగుల ఆధిక్యంలో ఉంది కంగారూ జట్టు. మాథ్యూ వేడ్ (15), ట్రవిస్ హెడ్ (11) క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి.. బిగ్​బాష్​ లీగ్​లో అరంగేట్రం స్టెయిన్​కు ఓ పీడకలే..!

ABOUT THE AUTHOR

...view details