తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 2:41 PM IST

ETV Bharat / sports

'ఐపీఎల్​తో మా జీవితాలు సాధారణ స్థితికి'

ఈ ఏడాది ఐపీఎల్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు రాబిన్​ ఉతప్ప. ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ​

Robin Uthappa
రాబిన్​ ఉతప్పా

కరోనా లాక్​డౌన్​తో ఇంతకాలం విసుగెత్తిపోయిన క్రీడాభిమానులకు ఐపీఎల్​ 13వ సీజన్​ ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు రాబిన్​ ఉతప్ప. ఈ మెగా లీగ్ ఎంతో ప్రత్యేకమైందిగా నిలుస్తుందన్నాడు. ఈ టోర్నీతో అందరి జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సీజన్​లో తమ జట్టు టైటిల్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఈ మెగాలీగ్​ జరగనుంది. తొలి మ్యాచ్​లో​ చెన్నై, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి.

ఇదీ చూడండి ధోనీ కొట్టిన సిక్సర్​కు​ మురళీ విజయ్ షాక్!

ABOUT THE AUTHOR

...view details