గువాహటి వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో దాదాపు చాలా రోజుల తర్వాత పేసర్ బుమ్రా, ఓపెనర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగుతున్నారు.
భారత్-శ్రీలంక మ్యాచ్కు వరుణుడు అడ్డంకి
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత్.. టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. గువాహటి వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడటం వల్ల పిచ్ను కవర్లతో కప్పేశారు.
భారత్-శ్రీలంక మ్యాచ్
ఈ మ్యాచ్లో గెలిచి.. సిరీస్ను ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈరోజు స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా, ఎన్ఆర్సీ-సీఏఏకు సంబంధించిన ఫ్లకార్డులు ప్రదర్శించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Last Updated : Jan 5, 2020, 7:01 PM IST