విండీస్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. ఆఖరి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్న వేళ భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గాయంతో పేసర్ భువనేశ్వర్ తప్పుకోగా... టీమిండియా మరో బౌలర్ దీపక్ చాహర్ తాజాగా గాయంతో వైదొలిగాడు. ఇతడి స్థానంలో నవదీప్ సైనీ జట్టులోకి రానున్నాడు.
"విశాఖ వన్డేలో దీపక్ చాహర్ గాయపడ్డాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడికి కొంచెం విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందుకే మూడో మ్యాచ్కు అందుబాటులో ఉండట్లేదు."
- బీసీసీఐ
కటక్ వేదికగా నిర్ణయాత్మక చివరి వన్డే ఆడనున్నాయి ఇరుజట్లు. ప్రస్తుతం 1-1 తేడాతో సిరీస్ సమమైంది. అయితే ఇలాంటి సమయంలో దీపక్ గాయపడటం కొంచెం లోటే. ఈ మధ్య కాలంలో చాహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఈ బౌలర్ అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలోనూ 8 వికెట్లు తీశాడు.