దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా జోరు కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ను 601/5 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లీసేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంకా 326 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.
మూడోరోజు 36/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టుపై భారత బౌలర్ల ఆధిపత్యం సాగింది. సారథి డుప్లెసిస్ (64), డికాక్ (31), బ్రూన్ (30) ఫర్వాలేదనిపించారు. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్ మహరాజ్, ఫిలాండర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్ (164 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) పోరాటంతో సౌతాఫ్రికా కాస్త మెరుగైన స్కోర్ చేయగలిగింది.