తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండోదీ మనదే.. మెరిసిన రాహుల్, శ్రేయస్

ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

By

Published : Jan 26, 2020, 3:32 PM IST

Updated : Feb 25, 2020, 4:37 PM IST

మ్యాచ్
మ్యాచ్

న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీసేన జోరు కొనసాగుతోంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటిన భారత బ్యాట్స్​మెన్ రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించారు. కివీస్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించారు.

ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. తొలి మ్యాచ్​లో ఆకట్టుకోని ఈ స్టార్ బ్యాట్స్​మన్ ఈ మ్యాచ్​లోనూ 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. కొంతకాలంగా అద్భుత ఫామ్​ చూపిస్తోన్న రాహుల్​ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్​లో రెండో అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్​ ఈ మ్యాచ్​లోనూ సత్తాచాటాడు. చివర్లో దాటిగా ఆడబోయి 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖరారైపోయింది. చివర్లో దూబే సిక్సుతో మ్యాచ్​ను ముగించాడు. రాహుల్ 57 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాగో విజయభేరి మోగించింది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెెండు వికెట్లు సాధించగా.. ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు.

తడబడిన కివీస్

టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్​ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్​లో కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు గప్తిల్ 33, మున్రో 26 పరుగులు చేశారు. మిగతా వారిలో విలియమన్స్ 14, గ్రాండ్​హోమ్ 3, టేలర్ 18, సీఫెట్ 33 పరుగులు సాధించారు.

భారత బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా, శివమ్ దూబే, శార్దుల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

Last Updated : Feb 25, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details