తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలిచింది ప్రపంచ కప్​నే... ప్రేక్షకుల హృదయాల్ని కాదు!

అండర్​19 ప్రపంచకప్​ గెలిచిన బంగ్లాదేశ్​ జట్టు ఆటగాళ్లు ప్రేక్షకుల మనసు గెలవలేక పోయారు. ఆదివారం జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత్​ ఆటగాళ్లను దూషిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. గెలిచినా తర్వాత వారి చేష్టలకు అదుపులేకుండా ప్రవర్తించారు బంగ్లా క్రీడాకారులు.

By

Published : Feb 10, 2020, 10:17 AM IST

Updated : Feb 29, 2020, 8:18 PM IST

Dream fulfilled but what happened after game unfortunate
కప్​ గెలిచినా.. ప్రేక్షకుల మనసు గెలవలేకపోయారు..!

బంగ్లాదేశ్ ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ప్రపంచకప్‌ గెలిచినా.. వారి ప్రవర్తన మాత్రం తీవ్ర విమర్శల పాలైంది. ఫైనల్‌లో బంగ్లా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆ జట్టు ఆటగాళ్లు నోటికి పని చెప్పారు. బ్యాట్స్‌మెన్‌ను అదే పనిగా కవ్వించారు. పేసర్‌ షొరిఫుల్‌ ఇస్లామ్‌ అయితే.. ప్రతి బంతికీ బ్యాట్స్‌మెన్‌ను తిడుతూ కనిపించాడు. దీనిపై వ్యాఖ్యాతల్లోనూ చర్చ జరిగింది. బదులుగా తర్వాత భారత బౌలర్లు కూడా కొన్నిసార్లు స్లెడ్జింగ్‌ చేసినా.. బంగ్లా ఆటగాళ్లు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు.

భారత్​, బంగ్లాదేశ్​ జట్ల మధ్య వాగ్వివాదం

అవును.. వారు చేసింది తప్పే..

మ్యాచ్‌లో చేసింది సరిపోదని.. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చి భారత కుర్రాళ్లను చూసి వెకిలి సంజ్ఞలు చేశారు. షొరిఫుల్‌ శ్రుతిమించిపోయిన ప్రవర్తనతో కనిపించాడు . దీనిపై బహుమతి ప్రదానోత్సవంలో బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ను ప్రశ్నిస్తే.. "ఇలా జరగడం దురదృష్టకరం. మా బౌలర్లు కొందరు ఎక్కువ ఉద్వేగానికి గురయ్యారు. ఎక్కువ ఉత్సాహపడ్డారు" అన్నాడు.

మైదానంలో బంగ్లా ఆటగాళ్ల అత్యుత్సాహం

ఇదీ చూడండి..ప్రపంచకప్​ను తొలిసారి ముద్దాడిన బంగ్లాదేశ్

Last Updated : Feb 29, 2020, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details