తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2019, 12:46 PM IST

Updated : Sep 30, 2019, 1:49 PM IST

ETV Bharat / sports

కోట్లా మైదానంలో క్రికెటర్ల నవ్వులే నవ్వుల్​

ఫిరోజ్​షా కోట్లా మైదానంలో ఇటీవల కోహ్లీ పెవిలియన్​ ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి టీమిండియా క్రికెటర్లంతా హాజరయ్యారు. ఎంతో ఆహ్లాదంగా సాగిన ఈ కార్యక్రమంలో రవిశాస్త్రి, శిఖర్​ ధావన్​.. కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు మరింత నవ్వించాయి. ఈ సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకోగా... అది వైరల్​గా మారింది.

కోట్లా మైదానంలో క్రికెటర్లు

ఫిరోజ్​షా కోట్లా స్టేడియానికి ఇటీవల మాజీ కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ పేరు పెట్టారు. ఇందులో ఓ స్టాండ్​కు 'విరాట్​ కోహ్లీ'గా నామకరణం చేశారు. పలువురు ప్రముఖుల హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా సాగింది.

వేడుకలో భాగంగా వ్యాఖ్యాత...​ "విరాట్​ ఎలాంటి సంగీతం వింటాడు" అని రవిశాస్త్రిని ప్రశ్నించాడు. "వెనకాల కూర్చున్న శిఖర్​ ధావన్​ను అడగండి.. చెప్తాడు.." అని సమాధానమిచ్చాడు కోచ్​.

ఈ ప్రశ్నకు ధావన్ నవ్విస్తూ సమాధానమిచ్చాడు. " పెళ్లికి ముందా? తర్వాత?" అంటూ జోక్​ పేల్చి.. విరాట్​కు పంజాబీ సంగీతం చాలా ఇష్టం. ముఖ్యంగా పాత పంజాబీ పాటలపై అభిమానం ఎక్కువ. గురుదాస్​ మన్​ సంగీతాన్ని.. అర్జిత్​ సింగ్​ ప్రేమ పాటల్ని వింటాడు" అని చెప్పాడు శిఖర్​.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ మైదానంలో.. మంచు కురిసే వేళలో...

Last Updated : Sep 30, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details