ఫిరోజ్షా కోట్లా స్టేడియానికి ఇటీవల మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఇందులో ఓ స్టాండ్కు 'విరాట్ కోహ్లీ'గా నామకరణం చేశారు. పలువురు ప్రముఖుల హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా సాగింది.
వేడుకలో భాగంగా వ్యాఖ్యాత... "విరాట్ ఎలాంటి సంగీతం వింటాడు" అని రవిశాస్త్రిని ప్రశ్నించాడు. "వెనకాల కూర్చున్న శిఖర్ ధావన్ను అడగండి.. చెప్తాడు.." అని సమాధానమిచ్చాడు కోచ్.