వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఆటగాళ్ల వేలం.. ఈనెల 19న కోల్కతాలో జరగనుంది. ఈ వేలం పాటకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. అయితే తాజాగా సన్రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ షేర్ చేసిన ఓ పోస్ట్ సందేహాలకు తావిస్తోంది. వచ్చే ఐపీఎల్లో స్టార్క్ సన్రైజర్స్కు ఆడతాడా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఏం జరిగింది..!
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన మిచెల్ స్టార్క్కు అభినందనలు చెప్పారు కివీస్ సారథి విలియమ్సన్, ఆసీసీ ఆటగాడు డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సామాజిక మధ్యమాల్లో షేర్ చేసిన వార్నర్ "వెల్కమ్ టు సన్ రైజర్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వార్నర్, విలియమ్సన్ ఇద్దరూ సన్రైజర్స్ ఆటగాళ్లు కావడం విశేషం. ఇప్పుడు ఈ పోస్టుపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
గతేడాది జరిగిన ఐపీఎల్కు దూరంగా ఉన్న స్టార్క్.. ఈ ఏడాది కూడా ఆడట్లేదని ప్రకటించాడు. ఇతడితో పాటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ దూరంగా ఉన్నాడు. మొత్తం 332 ఆటగాళ్లకు సంబంధించిన వేలం ఈనెల 19న కోల్కతా వేదికగా జరగనుంది.
ఇవీ చూడండి.. స్లో ఓవర్ రేట్.. విండీస్ జట్టుకు జరిమానా