తెలంగాణ

telangana

రంజీ ట్రోఫీ నిర్వహణపై తుది నిర్ణయం నేడే

By

Published : Jan 17, 2021, 9:01 AM IST

Updated : Jan 17, 2021, 9:30 AM IST

ఫిబ్రవరిలో రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయమై నేడు(జనవరి 17) జరిగే బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటే 2023-2031వరకు జరగాల్సిన ఐసీసీ ఎఫ్​టీపీ కమిట్​మెంట్స్ గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు.

bcci
బీసీసీఐ

వచ్చే నెలలో ఈ సీజన్​ రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది బీసీసీఐ. ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన ఆరు బయోబబుల్స్​లోనే ఈ టోర్నీని నిర్వహించాలని యోచిస్తోంది. నేడు(జనవరి 17) జరగనున్న బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో ఈ విషయమై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

"90శాతం ఫిబ్రవరిలో రంజీట్రోఫీ జరుగుతుంది. సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్స్​లోనే ఈ టోర్నీని నిర్వహిస్తాం. ఈ టోర్నీ లీగ్​ స్టేజ్​ను ఐపీఎల్​ ప్రారంభానికి ముందు నిర్వహిస్తాం. ఈ మెగాలీగ్​ పూర్తవ్వగానే నాకౌట్స్​, క్వార్టర్స్​, సెమీఫైనల్స్​, ఫైనల్స్​ నిర్వహిస్తాం.''

"-బీసీసీఐ అధికారి.

ఈ సమావేశంలో 2023-2031వరకు జరగాల్సిన ఐసీసీ ఎఫ్​టీపీ కమిట్​మెంట్స్ సహా పలు అంశాల గురించి చర్చించనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి : భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్

Last Updated : Jan 17, 2021, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details