తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2019, 7:20 PM IST

Updated : Oct 2, 2019, 12:13 AM IST

ETV Bharat / sports

భారత్​లో పర్యటనకు జింబాబ్వే స్థానంలో శ్రీలంక

వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ద్వైపాక్షిక టీ-20 సిరీస్​కు జింబాబ్వేకు బదులుగా శ్రీలంక జట్టును ఆహ్వానించింది బీసీసీఐ. ఐసీసీ.. జింబాబ్వేపై నిషేధం విధించడమే ఇందుకు కారణం.

శ్రీలంక

వచ్చే ఏడాది భారత్​లో పర్యటనకు జింబాబ్వే స్థానంలో శ్రీలంక రానుంది. ఆఫ్రికా జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరిలో లంక జట్టుతో టీమిండియా మూడు టీ20లు ఆడనున్నట్లు చెప్పింది.

"జింబాబ్వే జట్టు అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఈ కారణంగా భారత్​తో మూడు టీ-20 మ్యాచ్​లు ఆడేందుకు శ్రీలంక జట్టును ఆహ్వానించాం. లంక జట్టుఇందుకు సుముఖత వ్యక్తం చేసింది" -బీసీసీఐ ప్రకటన

గువహటి వేదికగా జనవరి 5న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. జనవరి 7న ఇండోర్​లో రెండో మ్యాచ్​, జనవరి 10 పుణె వేదికగా మూడో మ్యాచ్​ నిర్వహిస్తారు.

జింబాబ్వే క్రికెట్ బోర్డు అంతర్గత విషయాల్లో ఆ దేశ ప్రభుత్వం మితిమీరిన జోక్యం కారణంగా, జులైలో ఆ జట్టుపైఐసీసీ నిషేధం విధించింది.

ఇదీ చదవండి: జింబాబ్వే క్రికెట్ జట్టుపై ఐసీసీ నిషేధం

Last Updated : Oct 2, 2019, 12:13 AM IST

ABOUT THE AUTHOR

...view details