ఇటీవలే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్.. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోటీపడేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో వన్డే, టీ20 సిరీస్ల కోసం ఆసీస్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబరు 4 నుంచి పర్యటన ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తలపడే ముందు ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లు, టీ20 ఫార్మాట్లో ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడనుంది. సెప్టెంబర్ 6, 8 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్లు.. ఆ తర్వాత సెప్టెంబరు 11, 13, 16 తేదీల్లో మూడు వన్టేలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టామ్ హారిసన్ మాట్లాడుతూ.. ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టోర్నమెంటు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
ఈ పర్యటనకు కృషి చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, ఆటగాళ్లు, సిబ్బంది, నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మ్యాచ్లు జరిగేలా చూడటంలో వారి సహకారం కీలకమైనది. క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎంతో రసవత్తరమైనది.
టామ్ హారిసన్, ఈసీబీ సీఈఓ.