ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. నాలుగు టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో మన ఆటగాళ్లు తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసీస్ మీడియాకు చెందిన 9న్యూస్, ఏబీసీ.నెట్.ఏయూ, క్రికెట్.కామ్.ఏయూ, 7 ఛానెల్ తదితర మీడియా సంస్థలు కూడా భార్తను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్స్ చేస్తున్నాయి.
'గబ్బాలో భారత్ గర్జన', 'టీమ్ఇండియా చారిత్రక విజయం', 'భారత్ ప్రదర్శన అద్భుతం', 'రికార్డు బ్రేక్: గబ్బా వేదిక విజయంతో ఆసీస్పై భారత్ సిరీస్ సొంతం','మూడు దశాబ్దాల కాలంలో గబ్బాలో తొలిసారి ఆసీస్ ఓటమి చెందింది. భారత్ 2-1తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. నమ్మశక్యం కానిది.అంటూ పలు ట్వీట్స్ సహా హెడ్లైన్స్గా ప్రచురిస్తున్నాయి.