ప్రఖ్యాత యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 2-1తో సిరీస్లో ఆధిక్యం సంపాదించింది. అయితే ఈ మ్యాచ్లో ఓటమిపై ఇంగ్లీష్ జట్టు సారథి జో రూట్ స్పందించాడు. జట్టుగా నిలిచి గొప్పగా పోరాడామని అన్నాడు.
"చివరివరకు గెలుపు కోసం పోరాటం చేశాం. అందుకే మా జట్టును చూసి గర్విస్తున్నా. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఆడారు. మేం ఆడిన గొప్ప టెస్టుల్లో ఇదీ ఒకటి. ఓవల్లో జరిగే చివరి మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి సిరీస్ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాం" -రూట్, ఇంగ్లాండ్ సారథి
రెండు జట్లు గొప్ప ప్రదర్శన చేశాయని అన్నాడు రూట్. స్మిత్ వల్లే ఆసీస్ గెలిచిందని తెలిపాడు.