తెలంగాణ

telangana

ETV Bharat / sports

మా జట్టును చూసి గర్విస్తున్నా: రూట్

యాషెస్ నాలుగో టెస్టులో ఓడిపోయినా.. జట్టుగా పోరాడతామని అన్నాడు ఇంగ్లాండ్ సారథి రూట్. గురువారం ప్రారంభమయ్యే చివరి టెస్టులో పుంజుకుంటామని తెలిపాడు.

By

Published : Sep 9, 2019, 12:45 PM IST

Updated : Sep 29, 2019, 11:34 PM IST

రూట్

ప్రఖ్యాత యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 2-1తో సిరీస్​లో ఆధిక్యం సంపాదించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓటమిపై ఇంగ్లీష్ జట్టు సారథి జో రూట్ స్పందించాడు. జట్టుగా నిలిచి గొప్పగా పోరాడామని అన్నాడు.

"చివరివరకు గెలుపు కోసం పోరాటం చేశాం. అందుకే మా జట్టును చూసి గర్విస్తున్నా. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఆడారు. మేం ఆడిన గొప్ప టెస్టుల్లో ఇదీ ఒకటి. ఓవల్​లో జరిగే చివరి మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసి సిరీస్​ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాం" -రూట్, ఇంగ్లాండ్ సారథి

రెండు జట్లు గొప్ప ప్రదర్శన చేశాయని అన్నాడు రూట్. స్మిత్ వల్లే ఆసీస్ గెలిచిందని తెలిపాడు.

"స్టీవ్ స్మిత్​ వల్లే ఆస్ట్రేలియా గెలిచింది. రెండు ఇన్నింగ్స్​లోనూ జట్టు విజయానికి అవసరమైన పరుగులు చేశాడు. ఒత్తిడిలోనూ అతడి ప్రదర్శన అద్భుతం. రెండు జట్లకు ఉన్న తేడా స్మిత్​ మాత్రమే" -రూట్, ఇంగ్లాండ్ సారథి

ఈ సిరీస్​లో స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 211, రెండో ఇన్నింగ్స్​లో 82 పరుగులతో సత్తాచాటాడు. మొత్తంగా అన్ని మ్యాచ్​ల్లోనూ కలిపి ఇప్పటివరకు 134.2 సగటుతో 671 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇవీ చూడండి.. యాషెస్​: నాలుగో టెస్టులో ఆసీస్ గెలుపు

Last Updated : Sep 29, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details