ప్రపంచ క్రికెట్లో టీమ్ఇండియా అత్యుత్తమ స్థానంలో నిలవనుందని, విదేశాల్లో మ్యాచ్ల గెలిచే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనుందని దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రతిభావంతులు, విజయాలే ఇందుకు కారణమని పేర్కొన్నాడు.
"ఇటీవల ఆస్ట్రేలియాలో ఆసీస్పై గెలవడం భారత ఆటగాళ్లలోని సామర్ధ్యాన్ని వెలికి తీసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది. జట్లన్నీ విదేశాల్లో ఇబ్బంది పడుతుంటే టీమ్ఇండియా మాత్రం ఆ విధానాన్ని తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. గతంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లలా ఇప్పుడు భారత్ ఆధిక్యం ప్రదర్శించే అవకాశముంది" అని ఇయాన్ చాపెల్ తెలిపాడు.