తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 12:09 PM IST

ETV Bharat / sports

సిరాజ్​, సైనీలకు క్షమాపణలు చెప్పిన గిల్​క్రిస్ట్​

భారత బౌలర్లు మహ్మద్​ సిరాజ్​, నవదీప్​ సైనీలకు ఆస్ట్రేలియా మాజీ వికెట్​ కీపర్​ గిల్​క్రిస్ట్​ క్షమాపణలు చెప్పాడు. భారత్​, ఆస్ట్రేలియా తొలి వన్డేలో కామెంటరీ చేస్తూ, సిరాజ్​కు బదులుగా సైనీ తండ్రి చనిపోయారని అనడం ఇందుకు కారణం.

Adam Gilchrist apologises to Navdeep Saini, Mohammed Siraj after commentary gaffe
సిరాజ్​, సైనీలకు క్షమాపణలు చెప్పిన గిల్​క్రిస్ట్​

టీమ్​ఇండియా బౌలర్లు నవదీప్​ సైనీ, మహ్మద్​ సిరాజ్​లకు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్​ కీపర్​ గిల్​క్రిస్ట్​ ట్విట్టర్​లో క్షమాపణలు తెలిపాడు. భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న తొలి వన్డేకు కామెంటరీ చేస్తున్న గిల్​క్రిస్ట్​.. సిరాజ్​కు బదులుగా సైనీ తండ్రి మరణించాడని అన్నాడు. అనంతరం తప్పు తెలుసుకుని, ట్విట్టర్​ వేదికగా ఇద్దరూ బౌలర్లకు క్షమాపణలు చెప్పాడు.

"అవును.. నేను తప్పుగా మాట్లాడని గ్రహించాను. నా తప్పునకు సైనీ, సిరాజ్​లను క్షమాపణలు కోరుతున్నాను" అని గిల్​క్రిస్ట్​ ట్వీట్​ చేశాడు.

మహ్మద్​ సిరాజ్​ తండ్రి ఇటీవలే మరణించినా.. నిర్బంధ నియమాలకు కారణంగా సిరాజ్​ భారత్​కు రాలేదు. అయితే తన ఇంటికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినా.. తన తల్లి సూచన మేరకు జట్టుతో శిక్షణలో పాల్గొనాలని సిరాజ్​ నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టుకు మహ్మద్​ సిరాజ్​ ఎంపికవ్వగా.. నవదీప్​ సైనీ శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో ఆడుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details