Ganguly on Virat Kohli: టీమ్ఇండియా వన్డే క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే.. విరాట్ కోహ్లీని కెప్టెన్గా తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్ను కెప్టెన్గా నియమించడానికి కారణాలేంటో చెప్పాడు.
"బీసీసీఐ, సెలెక్టర్లు సంయక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. తొలుత టీ20 కెప్టెన్గా తప్పుకోవొద్దని బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. కానీ, అందుకు విరాట్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో టీ20కి ఒక కెప్టెన్, వన్డేకు మరో కెప్టెన్ అవసరమా? అనే భావన బీసీసీఐకి కలిగింది."
--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
విరాట్ టెస్టు కెప్టెన్గా కొనసాగుతాడని, రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్లకు సారథిగా వ్యవహరిస్తాడని గంగూలీ స్పష్టం చేశాడు. వన్డే కెప్టెన్గా విరాట్ను తొలగించడానికి ముందు అతడితో మాట్లాడినట్లు దాదా చెప్పాడు. సెలెక్టర్లు కూడా విరాట్తో మాట్లాడినట్లు పేర్కొన్నాడు. సారథిగా సేవలందించిన కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.
రోహిత్పై నమ్మకం ఉంది..