Bigg boss nagarjuna: బుల్లితెర ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన రియాల్టీ షో 'బిగ్బాస్'. ఐదు సీజన్లతో విశేషంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం.. ఇకపై ఓటీటీ వేదికగానూ అలరించనుంది. ఈ విషయాన్ని ఓటీటీ 'డిస్నీ ప్లస్ హాట్స్టార్' యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున గతేడాదే ప్రకటించారు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోకి సంబంధించి కొన్ని అప్డేట్స్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఫిబ్రవరి రెండో వారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదలకానున్నాయట. కార్యక్రమానికి ఎంపికైన కంటెస్టెంట్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంటారని, ఈ నెల 27 నుంచి షో ప్రసారమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.