ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'దొరసాని'. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్.. జులై 1న ఉదయం 10 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నాడు.
స్టార్ దర్శకుడి చేతుల మీదుగా 'దొరసాని' ట్రైలర్
జూలై 1న దొరసాని సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేయనున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా కనిపించనున్నాడు.
స్టార్ దర్శకుడి చేతుల మీదుగా 'దొరసాని' ట్రైలర్
1980 తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఈ చిత్రం తెరకెక్కింది. దిగువ తరగతి యువకుడు రాజు, దొరసాని దేవకిల మధ్య ప్రేమయాణమే ఈ సినిమా కథాంశం. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందించాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'దేవకి కాదు... మీరు నా దొరసాని' అంటున్న ఆనంద్ దేవరకొండ