కమల్హసన్ కూతురిగా పరిచయమైనా తనకంటూ ప్రత్యేకత సంపాదించింది హీరోయిన్ శ్రుతిహాసన్. 2016లో వచ్చిన 'శ్రీమంతుడు'లో చివరగా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాలు చేయడం తగ్గించేసింది. ఈ మధ్య లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షోలు నిర్వహించిన శ్రుతి.. ఇప్పుడు హాలీవుడ్లో నటించే అవకాశం దక్కించుకుంది.
యూఎస్ఏ నెట్వర్క్స్ నిర్మిస్తున్న 'ట్రెడ్ స్టోన్' సిరీస్ లో ఓ కీలక పాత్రకోసం శృతి హాసన్ ను సంప్రదించారు సదరు నిర్మాతలు. ఈ ఆఫర్కు ఆమె సానుకూలంగా స్పందించింది.