తెలంగాణ

telangana

బుల్లెట్​పై ఒక్కడు​.. సరిలేరు నీకెవ్వరు

By

Published : Oct 26, 2019, 5:36 PM IST

Updated : Oct 26, 2019, 7:23 PM IST

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మహేశ్​ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. బుల్లెట్​పై కనిపిస్తూ అభిమానుల్లో జోష్​ పెంచుతున్నాడు.

హీరో మహేశ్​బాబు

దీపావళి జోష్​ను మరింత పెంచేందుకు సిద్ధమయ్యాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు. 'సరిలేరు నీకెవ్వరు' కొత్త పోస్టర్​తో అభిమానుల్లో జోష్​ పెంచుతున్నాడు. బుల్లెట్​పై కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు ఉదయం విజయశాంతి పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ మాజీ హీరోయిన్.. భారతి అనే పాత్రలో కనిపించనుంది.

సరిలేరు నీకెవ్వరు మహేశ్​ కొత్త పోస్టర్

ఆర్మీ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం. మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు మహేశ్​. రష్మిక హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్​రాజు, మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: సరిలేరు నీకెవ్వరులో రాములమ్మ పోస్టర్ అదరహో..!

Last Updated : Oct 26, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details