స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఇందులోని 'సామజవరగమన' పాట రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్లో అత్యధికులకు నచ్చిన తెలుగు పాటగా నిలిచింది. దాదాపు 7 లక్షల మందికి పైగా ఈ గీతాన్ని లైక్ చేశారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతమందించిన ఈ పాట విడుదలైన మొదటి రెండు రోజులు యూట్యూబ్ ట్రెండింగ్లో అగ్రస్థానంలో నిలిచింది.