తెలంగాణ

telangana

ETV Bharat / sitara

5 రోజుల్లో రూ. 350 కోట్లతో సాహో సునామీ!

విడుదలైన 5 రోజుల్లోనే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది సాహో చిత్రం. 2019లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

By

Published : Sep 4, 2019, 10:17 AM IST

Updated : Sep 29, 2019, 9:33 AM IST

సాహో

మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది సాహో. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలై బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజైన 5 రోజుల్లోనే రూ. 350 కోట్ల కలెక్షన్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోన్న సాహో

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.

ఇది చదవండి: మెగాఫోన్​ పట్టనున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్​

Last Updated : Sep 29, 2019, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details