పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా(raj kundra and sherlyn chopra), అతడి భార్య నటి శిల్పాశెట్టిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది నటి షెర్లిన్ చోప్రా. వారిద్దరు తనను మాఫియాతో బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది(sherlyn chopra raj kundra shilpa shetty). తన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేయాలని అభ్యర్థించింది.
ఇటీవల కుంద్రా దంపతులు(sherlyn chopra rajkundra) షెర్లిన్పై రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. తనపై పరువు నష్టం దావా వేయడం సహా మానసికంగా వేధించినందుకు రూ.75కోట్లు చెల్లించాలని కుంద్రా దంపతులకు నోటీసులు పంపించినట్లు పేర్కొంది.