తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2021, 8:05 PM IST

ETV Bharat / sitara

'​శిల్పాశెట్టి, కుంద్రా.. నన్ను మాఫియాతో బెదిరించారు'

నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా(sherlyn chopra raj kundra shilpa shetty) తనను మాఫియాతో బెదిరించారని ఆరోపణలు చేసింది నటి షెర్లిన్​ చోప్రా(sherlyn chopra rajkundra). తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది.

sherlyn
షెర్లిన్​

పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా(raj kundra and sherlyn chopra), అతడి భార్య నటి శిల్పాశెట్టిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది నటి షెర్లిన్​ చోప్రా. వారిద్దరు తనను మాఫియాతో బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది(sherlyn chopra raj kundra shilpa shetty). తన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేయాలని అభ్యర్థించింది.

ఇటీవల కుంద్రా దంపతులు(sherlyn chopra rajkundra) షెర్లిన్​పై రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. తనపై పరువు నష్టం దావా వేయడం సహా మానసికంగా వేధించినందుకు రూ.75కోట్లు చెల్లించాలని కుంద్రా దంపతులకు నోటీసులు పంపించినట్లు పేర్కొంది.

అశ్లీల చిత్రాల కేసులో భాగంగా ఇటీవలే రాజ్​కుంద్రా బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా(raj kundra and sherlyn chopra) పలు ఆరోపణలు చేసింది. తనను బెదిరించి తనపై అశ్లీల చిత్రాలు చిత్రీకరించారని పేర్కొంది. ఈ విషయమై సాయం కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఆరోపణలపై స్పందించిన శిల్ప, కుంద్రా.. షెర్లిన్​పై రూ.50కోట్ల పరువు నష్టం(sherlyn chopra defamation case) దావా వేశారు.

ఇదీ చూడండి: షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా

ABOUT THE AUTHOR

...view details