ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన బికీనీ ఫొటోలపై ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్న వారిపై విరుచుకుపడింది. మతంపై అధికారం ఉన్న వాళ్లలా నటించొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
"నా ఫొటోలు చూసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ భైరవి దేవీ వెంట్రుకలు విరబోసుకుని, రక్తం తాగుతూ, బట్టల్లేకుండా మీ ముందుకు వస్తే ఏం జరుగుతుంది? మీరు భయపడతారు. అలాంటి మీరు భక్తులం అని ఎలా చెప్పుకొంటారు? మతం మీద అధికారం ఉన్నవాళ్లలా నటించకండి."
-- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి.