తెలంగాణ

telangana

కరణ్ జోహర్​కు బాలీవుడ్​ క్వీన్ కంగన​ చురకలు

By

Published : Aug 16, 2020, 5:48 PM IST

'గుంజన్ సక్సేనా' బయోపిక్​పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​. ఈ చిత్రంలో పాత్రధారికి విమానం నడపాలనే ఆశ తప్ప.. దేశభక్తితో సైన్యంలో చేరలేదని వెల్లడించింది. ఈ చిత్ర నిర్మాత కరణ్​ జోహర్​పై ఓ కవిత ద్వారా స్పందించింది నటి కంగన.

Kangana Ranaut hits back at Karan Johar, Gunjan Saxena biopic
'గుంజన్ సక్సేనా' నిర్మాతపై బాలీవుడ్​ క్వీన్​ చురకలు

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​ రూపొందించిన 'గుంజన్ సక్సేనా' చిత్రంపై స్పందించింది నటి కంగనా రనౌత్​. ఈ చిత్ర నిర్మాతపై ఓ కవిత ద్వారా తన భావాన్ని వ్యక్తపరిచింది.

"కరణ్​ జోహర్​ కోసం ఓ కవిత. మేము జాతీయవాదంపై ఆధారపడతాం. కానీ, దేశభక్తిని చూపించం. పాకిస్థాన్​తో జరిగిన యుద్ధం ఆధారంగా నిర్మించిన చిత్రాలతో డబ్బు సంపాదిస్తాం. మేమూ అలాంటి సినిమాలే చేస్తాం. కానీ, ఇందులో భారతీయులు ఇప్పటికీ ప్రతినాయకులే. ఆర్మీలో ప్రస్తుతం థర్డ్ జెండర్​ వ్యక్తులూ చేరారు. కరణ్​ జోహర్​ ఓ సైనికుడు అని మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు."

-కంగనా రనౌత్​ టీమ్​ ట్విట్టర్​ పోస్ట్​ సారాంశం

'గుంజన్​ సక్సేనా' చిత్రం గురించి స్పందించిన నటి కంగనా రనౌత్​.. "ఈ చిత్రం ఓ సైనికురాలి జీవితం ఆధారంగా రూపొందించినా.. అందులోని సారాంశాన్ని కోల్పోయి చిన్న చిత్రంగా మారింది. భారత్​ను రక్షించడానికే తాము ఇక్కడ ఉన్నామని​ ప్రత్యర్థులకు తెలియజేస్తుంది గుంజన్. ఈ సినిమాలో ఆమె సమాన అవకాశాల కోసం పోరాడింది. ఇందులో గుంజన్​ పాత్ర గెలిచిందే తప్ప భారతదేశం కాదు" అని ట్వీట్​ చేసింది.

మరో ట్వీట్​లో.. "ఈ సినిమాలో దేశభక్తి ఏమి ఉంది. ఇందులో 'దేశభక్తి కంటే తాను విమానాన్ని నడపాలన్న కోరిక' అనే డైలాగ్​ను పాత్రధారి చాలాసార్లు చెప్పింది. ఆమెలోని దేశభక్తే వాయుసేనలో చేరడానికి ప్రేరేపించిందనే దానికి ఎలాంటి ఆధారం లేదు. యూనిఫాంకు అసలైన అర్థాన్ని ఆమె ఎలా తెలుసుకుంది" అని పేర్కొంది నటి కంగనా రనౌత్​.

ఈ సినిమాపై నటి కంగనా రనౌత్​ కాకుండా మరెంతో మంది సోషల్​మీడియాలో విరుచుకుపడ్డారు. నిర్మాత కరణ్​ జోహర్​.. భారత వాయుసేనను అగౌరవపరిచారనే యాష్​ట్యాగ్​తో గురువారం పలువురు నెటిజన్లు పోస్టు​లు పెట్టారు. ఈ చిత్రంలో లింగవివక్ష గురించి చూపించడంపై విమర్శలు ఎదుర్కొంది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details