తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 11:03 AM IST

Updated : Nov 12, 2019, 11:13 AM IST

ETV Bharat / sitara

అజ్మీర్​ దర్గాలో హీరోయిన్ కాజల్ ప్రత్యేక ప్రార్థనలు

రాజస్థాన్​లోని అజ్మీర్​ దర్గాను సందర్శించింది కథానాయిక కాజల్. ఆ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్న 'భారతీయుడు-2' సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది.

అజ్మీర్​ దర్గాలో కాజల్ ప్రత్యేక ప్రార్ధనలు

హీరోయిన్ కాజల్​ అగర్వాల్​.. ప్రస్తుతం రాజస్థాన్​లో జరుగుతోన్న 'భారతీయుడు-2' షూటింగ్​లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా అజ్మీర్​లోని సూఫీ సెయింట్​ కావాజా మొయినుద్దీన్ దర్గాను తల్లితో కలిసి సందర్శించింది. చాదర్, పూలు సమర్పించింది. తను నటించే కొత్త సినిమాలు హిట్​ కావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేసింది.

అజ్మీర్​ దర్గాలో కాజల్ ప్రత్యేక ప్రార్ధనలు

1996లో వచ్చిన 'భారతీయుడు'కు సీక్వెల్​గా రూపొందుతోంది 'భారతీయుడు-2'. కమల్​హాసన్ హీరోగా నటిస్తున్నాడు. సేనాపతి అనే 90 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్​ కిషన్​ఘర్​లోని పూల్​ మహల్​ పరిసర ప్రాంతాల్లో షూటింగ్​ జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: లాల్​బాగ్​ గణేశునికి కాజల్​ ప్రత్యేక పూజలు

Last Updated : Nov 12, 2019, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details