బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ సంతాపం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం.. ఈ యువ నటుడి మరణంపై విచారం వ్యక్తం చేసింది. నిజమైన స్నేహితుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల డిప్యూటీ డైరక్టర్ జనరల్ గిలాడ్ కోహెన్ ట్వీట్ చేశారు.
హీరో సుశాంత్ మృతిపై ఇజ్రాయెల్ అధికారి ట్వీట్
సుశాంత్ సింగ్ లాంటి నిజమైన స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని ఇజ్రాయెల్ అధికారి గిలాడ్ కోహెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్
"సుశాంత్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అతడు ఇజ్రాయెల్కు నిజమైన స్నేహితుడు. నిన్ను చాలా మిస్సవుతున్నాం" అని గిలాడ్ రాసుకొచ్చారు. దీనితో పాటే సుశాంత్ నటించిన 'డ్రైవ్' సినిమాలోని 'మఖనా' పాటను షేర్ చేశారు. ఈ గీతం మొత్తాన్ని ఇజ్రాయెల్లోనే చిత్రీకరించారు. ఇందులో సుశాంత్తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: