నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి ఓ చిత్రం చేస్తున్నారు. మార్చిలో షూటింగ్ మొదలుపెట్టినా సరే కరోనా కారణంగా అది కాస్త నిలిచిపోయింది. త్వరలో తిరిగి దానిని ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది.
సీనియర్ నటి మీనా ఈ చిత్రంలోని కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నటించేందుకు ఆమె సానుకూలంగా ఉందని తెలుస్తోంది. సెప్టెంబరు రెండో వారం నుంచి చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. గతంలో 'బొబ్బిలి సింహం', 'ముద్దుల మొగుడు'తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య-మీనా కలిసి నటించారు.