వెంకటేశ్-వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఉపశీర్షిక. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్రాజు నిర్మించారు. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఇందులో కథానాయికలుగా తమన్నా, మెహరీన్ నటించి అలరించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3'గా చిత్రీకరణ జరుపుకొంటోంది. అయితే 'ఎఫ్2' చిత్రానికి సంబంధించి హిందీ రీమేక్ను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో కలిసి దిల్రాజు నిర్మించనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. త్వరలోనే చిత్రాన్ని హిందీలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.