తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 10:58 AM IST

Updated : Oct 30, 2019, 6:23 PM IST

ETV Bharat / sitara

ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. అల్లు అరవింద్ క్లాప్​ కొట్టాడు.

అల్లు అర్జున్

బన్నీ-సుకుమార్ సినిమా ప్రారంభ కార్యక్రమం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు జరిగాయి. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించనుంది.

ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్​ కొట్టగా, దర్శకుడు సురేందర్​ రెడ్డి... చిత్రబృందానికి స్క్రిప్టును అందించాడు.

క్లాప్ కొడుతున్న అల్లు అరవింద్
స్క్రిప్టు అందించిన అల్లు సురేందర్​ రెడ్డి

మైత్రీ మూవీ మేకర్స్ క్రియేషన్స్​ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్​లో వచ్చిన ఆర్య, ఆర్య-2 ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో..' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నాడట.

ఇదీ చదవండి: గుడ్ నైట్​తో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నిధి..!

Last Updated : Oct 30, 2019, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details