తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2020, 9:20 AM IST

ETV Bharat / sitara

'ఆర్​ఎక్స్​ 100'కు సీక్వెల్.. ఈసారి ఎలా ఉండనుందో?

కార్తికేయ, పాయల్​ రాజ్​పుత్​ నటించిన 'ఆర్​ఎక్స్​ 100'కు త్వరలో సీక్వెల్​ రాబోతున్నట్లు చెప్పారు దర్శకుడు అజయ్​ భూపతి. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఇన్​స్టా లైవ్​చాట్​లో వెల్లడించారు.

Ajay Bhupathi is ready for RX100 sequel
త్వరలో 'ఆర్​ఎక్స్​ 100' సీక్వెల్​

'ఆర్‌ఎక్స్‌ 100'.. పేరుకే చిన్న సినిమా అయినా, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్​లను రాత్రికి రాత్రే స్టార్లను చేసింది. ‌ వాస్తవ సంఘటనలతో, పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. త్వరలో దీనికి సీక్వెల్‌ రాబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడే ధ్రువీకరించారు.

లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన డైరెక్టర్ అజయ్ భూపతి.. కథానాయకుడు కార్తికేయ, అభిమానులతో ఇన్‌స్టా‌ వేదికగా ముచ్చటించారు. ఈ క్రమంలో 'ఆర్‌ఎక్స్‌ 100'కు సీక్వెల్‌ వస్తుందా? అని ఓ నెటిజన్‌ అజయ్‌ను అడగ్గా.. ఉంటుందని బదులిచ్చారు. ప్రస్తుతం చేస్తున్న 'మహాసముద్రం' పూర్తయిన తర్వాతే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈసారి ఎలాంటి సెన్సేషనల్ కథతో వస్తారోనని అభిమానులు అప్పుడే చర్చించుకుంటున్నారు.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ విరామాన్ని 'రకుల్' ఎలా అస్వాదిస్తుందంటే?​

ABOUT THE AUTHOR

...view details