కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. షాపు యజమాని సీసీ పుటేజ్ను పరిశీలించగా అందులో బుర్కా వేసుకున్న ఓ మహిళ చాకచక్యంగా దొంగతనం చేసి తప్పించుకున్నట్లు తెలిసింది.
సూపర్ మార్కెట్లో మహిళ.. నిత్యావసరాలు దోచేసింది
ఓ సూపర్ మార్కెట్కు ఓ లేడీ బుర్కా వేసుకుని వచ్చింది. తనకు కావాల్సిన నిత్యావసరాలు తీసుకుంది. యజమానికి కనిపించకుండా తీసుకుని పారిపోయింది. గమనించిన సూపర్ మార్కెట్ యజమాని ఆమెను నిలదీయడానికి ప్రయత్నించగా వెళ్లిపోయింది. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
సూపర్ మార్కెట్లో మహిళ.. నిత్యావసరాలు దోచేసింది
సబ్బుల సెట్లు, టీపొడి ప్యాకెట్స్, టూత్ పేస్టులు, చాక్లెట్లు తీసుకున్నట్లు పుటేజ్లో కనిపించింది. గత 15 రోజుల సీసీ పుటేజ్ పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సూపర్ మార్కెట్ యజమాని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :గోడ కూలి బాలిక మృతి, ఇద్దరికి గాయాలు