తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం.. కొనసాగుతున్న దర్యాప్తు

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మరణించిన ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​ వద్ద జరిగింది. రైలు పట్టాలపై తలపెట్టి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.

By

Published : Oct 30, 2020, 5:51 PM IST

Unidentified body found on railway tracks of medchal malkajgiri district
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం.. కొనసాగుతున్న దర్యాప్తు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​ నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్​ మధ్యలోని పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం రైల్వే పోలీసులకు లభ్యమైంది. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరణించిన వ్యక్తి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే కోణంలో రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details