అబ్బాయి.. అమ్మాయి ప్రేమించుకోవటం సహజం. కానీ అమ్మాయి.. అమ్మాయి ప్రేమించుకుని పారిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలులో జరిగింది. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన యువతి (21), నర్సింహారెడ్డినగర్కు చెందిన మరో యువతి (20) చిన్ననాటి నుంచే స్నేహితులు. అలా వారిద్దరి మధ్య స్నేహం ప్రేమ బంధంగా మారింది.
ఇద్దరు యువతుల ప్రేమాయణం.. ఇంటి నుంచి అదృశ్యం
ఆ యువతులు ఇద్దరూ చిన్న నాటి నుంచే స్నేహితులు. వయసు వచ్చాక స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకనో, తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరన్న భయంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలులో జరిగింది.
ఇద్దరు యువతుల ప్రేమాయణం.. ఇంటి నుంచి అదృశ్యం
'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము ఇంటి నుంచి వెళ్లిపోతున్నాం' అంటూ ఈ నెల 3న వారిద్దరూ తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం పంపి అదృశ్యమయ్యారు. చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోవటం వల్ల ఇరువురి తల్లిదండ్రులు కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్వర రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రమాదం