తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్​ అమెరికాలో మృతి చెందాడు. ఈస్టర్​ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్​ బీచ్​కు వెళ్లి గల్లంతయ్యాడు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

By

Published : Apr 23, 2019, 12:48 PM IST

Updated : Apr 23, 2019, 3:38 PM IST

యూఎస్​ఏలో తెలుగు విద్యార్థి మృతి

యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

యూఎస్ఏలో తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్​నగర్​కు చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పీజీ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్​ ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్​కు వెళ్లాడు. ఒక్కసారిగా అలలు రావడంతో శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారులు సోమవారం శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Last Updated : Apr 23, 2019, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details