యూఎస్ఏలో తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్నగర్కు చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పీజీ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్కు వెళ్లాడు. ఒక్కసారిగా అలలు రావడంతో శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారులు సోమవారం శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
యూఎస్ఏలో తెలంగాణ విద్యార్థి మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్ అమెరికాలో మృతి చెందాడు. ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్కు వెళ్లి గల్లంతయ్యాడు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
యూఎస్ఏలో తెలుగు విద్యార్థి మృతి