సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున నేమిచంద్ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దుకాణం యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
డ్రైవరే కేటుగాడు.. గోల్డ్ దొంగలు దొరికారు..
సికింద్రాబాద్లో బంగారు ఆభరణాల చోరీ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించారు. జ్యువెలరీ షాప్ యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్.. స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.
ఆభరణాల దొంగతనం, సికింద్రాబాద్, నేమిచంద్ జ్యువెలరీ షాప్
తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిన్నట్ట పోలీసుల విచారణలో డ్రైవర్చెప్పాడు. దుకాణం వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి నిందుతులు.. 1.20 కేజీల బంగారం, 302 గ్రాముల వెండి దోచుకెళ్లారు. చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:జ్యువెలరీ షాప్లో 1.20 కిలోల బంగారం చోరీ
Last Updated : Jan 16, 2021, 9:59 AM IST