తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డ్రైవరే కేటుగాడు.. గోల్డ్ దొంగలు దొరికారు..

సికింద్రాబాద్​లో బంగారు ఆభరణాల చోరీ కేసును మార్కెట్​ పోలీసులు ఛేదించారు. జ్యువెలరీ షాప్​ యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్.. స్నేహితులతో కలిసి​ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.

By

Published : Jan 16, 2021, 9:27 AM IST

Updated : Jan 16, 2021, 9:59 AM IST

secunderabad market police, gold robbery, nemichand jewellary shop
ఆభరణాల దొంగతనం, సికింద్రాబాద్​, నేమిచంద్​ జ్యువెలరీ షాప్

సికింద్రాబాద్​ మార్కెట్​ పీఎస్​ పరిధిలో బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున నేమిచంద్​ జ్యువెలరీ షాప్​లో చోరీ జరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దుకాణం యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిన్నట్ట పోలీసుల విచారణలో డ్రైవర్చెప్పాడు. దుకాణం వెంటిలేటర్​ ద్వారా లోపలికి ప్రవేశించి నిందుతులు.. 1.20 కేజీల బంగారం, 302 గ్రాముల వెండి దోచుకెళ్లారు. చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:జ్యువెలరీ షాప్​లో 1.20 కిలోల బంగారం చోరీ

Last Updated : Jan 16, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details