తెలంగాణ

telangana

భూమి కోసం.. పెదనాన్నను పొట్టన పెట్టుకున్నాడు!

By

Published : Dec 26, 2020, 10:19 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈ నెల 20న జరిగిన హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణమూర్తిని తన తమ్ముడి కుమారుడైన మురళీకృష్ణ... భూ వివాదంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మురళీకృష్ణతో పాటు అతని కుమారులు, భార్యకు ప్రమేయం ఉన్నట్లు చెప్పారు.

police-arrested-burripalem-murder-victims
భూమి కోసం.. పెదనాన్నను పొట్టన పెట్టుకున్నాడు!

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈ నెల 20న జరిగిన హత్య కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుర్రిపాలెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి తన అన్న కుమారుడు మరళీకృష్ణతో పొలం దారి విషయంలో వివాదం నేపథ్యంలో.. ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి గతంలోనూ గొడవలు జరిగాయని.. కృష్ణమూర్తి పేరిట ఉన్న పొలంలో మురళీకృష్ణ వరి పంట వేయగా... దాన్ని కృష్ణమూర్తి దున్నించాడు.

ఈ విషయంలో పెదనాన్నపై కక్షగట్టిన మురళీకృష్ణ.. చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పథకం ప్రకారం ఈ నెల 20వ తేదిన కృష్ణమూర్తి పొలానికి వెళ్తున సమయంలో అతనిపై కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశాడని.. మురళీకృష్ణతో పాటు అతని కుమారులు, భార్య ఈ దాడిలో పాల్గొన్నారని తెనాలి గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితులను ఈనెల 25వ తేదిన నందివెలుగు అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని వారినుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితులను రిమాండ్​కు పంపుతున్నట్లు తెనాలి డీఎస్పి స్రవంతి రాయ్ తెలిపారు.

ఇదీ చదవండి:హిజ్రాల హల్‌చల్‌.. 10మంది అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details